బాబు జిమ్మిక్కులు వారు నమ్మరు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జయహో బీసీ పేరిట సభపెట్టి [more]

Update: 2019-01-28 04:56 GMT

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జయహో బీసీ పేరిట సభపెట్టి వారిని తిరిగి దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులను, జస్టిస్ ఈశ్వరయ్య విషయంలో మీరు అవలంబించిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.

హామీల అమలు ఏదీ?

2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారో చెప్పాలన్నారు. బీసీలు మీరు వెనక ఎందుకుండాలో తెలపాలన్నారు. కొత్తగా ఫెడరేషన్ లను కార్పొరేషన్లగా మారుస్తున్నానంటూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన అన్నారు. వైఎస్ బీసీలను ఎంత ప్రేమగా చూశారో అందరికీ తెలుసునన్నారు. అలాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మీరు అవమానపర్చే విధంగా మాట్లాడతారా? అని నిలదీశారు. గత ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో చెప్పకుండా మళ్లీ వస్తే చేస్తామని చెప్పడం మోసం కాదా? అని ధర్మాన ప్రశ్నించారు.

Tags:    

Similar News