ఏపీకి రండి…. జగన్ పాలన చూసి పోండి

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారని [more]

Update: 2021-07-15 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారని దేవినేని ఉమ అన్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. రెండున్నరేళ్లుగా కొత్త రోడ్లు లేవు, ఉన్న రోడ్లకు మరమ్మతులు లేవని దేవినేని ఉమ విమర్శించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో రోడ్ల మరమ్మత్తులకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదని దేవినేని ఉమ దుయ్యబట్టారు. రోడ్ల దుస్థితి జగన్ పాలనకు అద్దం పడుతుందని దేవినేని ఉమ అన్నారు.

Tags:    

Similar News