మీటనొక్కితే డబ్బులు పడుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండి పడ్డారు. మూడు నెలలు కావస్తున్నా రైతులకు ధాన్యం బకాయీలు [more]

Update: 2021-07-08 06:52 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండి పడ్డారు. మూడు నెలలు కావస్తున్నా రైతులకు ధాన్యం బకాయీలు చెల్లించలేదని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్ లో అప్పలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ఆఫీసులో మీట నొక్కి డబ్బులు వేస్తున్నామని ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు. అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నా పట్టించుకోవడం లేదని దేవినేని ఉమ అన్నారు. బూతులపై దృష్టి పెట్టిన మంత్రులు రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని దేవినేని ఉమ కోరారు.

Tags:    

Similar News