విశాఖలో తక్కువ కేసులు చూపిస్తుందందుకే?

విశాఖపట్నంలో తక్కువ కేసులను ప్రభుత్వం కావాలనే చూపిస్తుందని, అక్కడ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఒక స్వామీజీ చెప్పిన కారణంగా ఏప్రిల్ [more]

Update: 2020-04-14 12:43 GMT

విశాఖపట్నంలో తక్కువ కేసులను ప్రభుత్వం కావాలనే చూపిస్తుందని, అక్కడ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఒక స్వామీజీ చెప్పిన కారణంగా ఏప్రిల్ 28వ తేదీన విశాఖకు జగన్ తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. అందుకే విశాఖలో తక్కువ కేసులు చూపిస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. విశాఖను గ్రీన్ జోన్ లోకి తెచ్చేందుకే అక్కడ పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులపై ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని ఉమ అన్నారు. లాక్ డౌన్ ను ఎత్తివేస్తే జగన్ ఐదు రోజుల్లో ఎన్నికలు జరపాలని ప్లాన్ చేసుకున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.

Tags:    

Similar News