సుజనాను కేబినెట్ లోకి తీసుకునే ముందే...??

Update: 2018-11-27 05:15 GMT

జగన్ కు సీఎం పదవివై వ్యామోహం తప్ప మరొకటి లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా అడ్డుగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే వైసీపీ పని అని, పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో అందరికీ తెలుసునన్నారు. పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల నాటి కల అని, దానిని చంద్రబాబు సాకారం చేసి చూపిస్తున్నారన్నారు.

జగన్ కు కన్పించవా...?

ఇవేవీ జగన్ కు కనిపించడం లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై ఈడీ దాడులు కక్ష పూరితమైనవేనన్నారు. సుజనా చౌదరిని కేబినెట్ లోకి తీసుకునే ముందే అన్ని విచారణలు చేశారన్నారు. ఆ తర్వాతే మోదీ మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాతే సుజనా చౌదరిపై ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. సుజనా చౌదరి దీనిపై న్యాయపోరాటం చేస్తారన్నారు. సుజనాచౌదరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Similar News