సినీహీరో వ్యవసాయ క్షేత్రంలో కలకలం

ఒక ప్రముఖ హీరోకు చెందిన వ్యవసాయ భూమిలో మృతిదేహాం లభ్య మైంది. షాద్ నగర్ మండలంలో కేశం పెట్ పరిధిలోని వ్యవసాయ భూమిలో కుళ్లిన పొయిన మృతిదేహాన్ని [more]

Update: 2019-09-19 02:09 GMT

ఒక ప్రముఖ హీరోకు చెందిన వ్యవసాయ భూమిలో మృతిదేహాం లభ్య మైంది. షాద్ నగర్ మండలంలో కేశం పెట్ పరిధిలోని వ్యవసాయ భూమిలో కుళ్లిన పొయిన మృతిదేహాన్ని పోలీసులు గుర్తించారు. పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని ఇటివల కాలంలో ఒక సిని హీరో కొనుగొలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే పాపిరెడ్డిగూడ గ్రామంలో సినినటుడికి సుమారు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ పొలం కొనుగోలుచేసినప్పటి నుండి ఎలాంటి సేద్యం చేయలేదు. అయితే ఈ నెల 10న హీరో సతీమని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని మొక్కలు నాటారు. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక గదిలో శవం……

వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువులతో కూరగాయల పంటలు సాగుచేయాలనే ఉద్దేశంతో హీరో కుంటుంబీకులు సేద్యం చేయడానికి కొంతమందిని వ్యవసాయ క్షేత్రానికి పంపించగా వారు వ్యవసాయక్షేత్రంలో తిరిగి పరిశీలిస్తుండగా అక్కడ ఉన్న ఓ గదిలో కుళ్లిపోయిన శవాన్ని కనుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని కేశంపేట పోలీసులకు అందించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన శవాన్ని పరిశీలించారు. శవం ఉన్న గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చనిపొయిన వ్యక్తి ఎవరన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News