పేరుకుపోతున్న మృతదేహాలు.. రాని కుటుంబ సభ్యులు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. కరోనా వైరస్ సోకి మరణించడంతో మృతదేహాలను బంధువులు తీసుకెళ్లడం లేదు. సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని [more]

Update: 2020-07-27 04:45 GMT

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. కరోనా వైరస్ సోకి మరణించడంతో మృతదేహాలను బంధువులు తీసుకెళ్లడం లేదు. సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని చూసేందుకు కూడా రావడం లేదు. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 30 మృతదేహాలు ఉన్నాయి. మార్చురీలో మృతదేహాలు నిండిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మృతదేహంపైనా కరోనా వైరస్ ఉంటుందన్న అపోహతోనే అటువైపు మృతుల కుటుంబ సభ్యులు చూడటం లేదు.

Tags:    

Similar News