చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తల ఆందోళన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస ప్రాంతం ఆందోళనలతో దద్దరిల్లుతోంది. ఇవాళ దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యే [more]

Update: 2019-03-14 07:36 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస ప్రాంతం ఆందోళనలతో దద్దరిల్లుతోంది. ఇవాళ దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వవద్దని, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శిద్ధా కృషి చేసినందున ఆయనను మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక, శిద్ధా మాత్రం కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, ఆయన చెప్పినట్లుగా చేస్తానని ప్రకటించారు.

Tags:    

Similar News