వలస కూలీలు కన్పించగానే నీలం సాహ్ని

ముఖ్యమంత్రి జగన్ నివాసానికి సమీపంలో ఉన్న వారధిపై బీహార్ కు చెందిన వలస కూలీలు వెళుతున్నారు. అదే సమయంలో సీఎం జగన్ తో సమీక్ష ముగించుకుని వెళుతున్న [more]

Update: 2020-05-15 14:12 GMT

ముఖ్యమంత్రి జగన్ నివాసానికి సమీపంలో ఉన్న వారధిపై బీహార్ కు చెందిన వలస కూలీలు వెళుతున్నారు. అదే సమయంలో సీఎం జగన్ తో సమీక్ష ముగించుకుని వెళుతున్న చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అటుగా వెళుతూ వారిని చూసి ఆగారు. వారితో మాట్లాడారు. బీహార్ కు కాలినడకన వెళుతున్నామని వలస కూలీలు చెప్పడంతో నీలం సాహ్ని వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్, గుంటూరు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడారు. వారికి వెంటనే వసతి, భోజన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. బీహార్ కు వెళ్లే శ్రామిక్ రైళ్లలో వారిని పంపేలా ఏర్పాటు చేయాలని అధికారులకు నీలం సాహ్ని ఆదేశించారు.

Tags:    

Similar News