నేడు కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ను నేడు కృష్ణా జిల్లాలో నిర్వహించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. మొత్తం ఐదు కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు చేశారు. [more]

Update: 2020-12-28 02:02 GMT

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ను నేడు కృష్ణా జిల్లాలో నిర్వహించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. మొత్తం ఐదు కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డ్రైరన్ ను నిర్వహించనున్నారు. ఒక్కొక్క సెంటర్ లో ఐదుగురు వ్యాక్సినేషన్ అధికారులను నియమించారు. ప్రతి కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ డ్రైరన్ ను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు దేశంలో నాలుగు రాష్ట్రాలు డ్రైరన్ కు ఎంపిక కాగా, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి.

Tags:    

Similar News