హైదరాబాదే బాదేసింది.. ఇక్కడే అత్యధికంగా కేసులు?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కు చేరుకుంది. 18 మంది మృతి చెందారు. 110 [more]

Update: 2020-04-15 03:09 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కు చేరుకుంది. 18 మంది మృతి చెందారు. 110 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 516ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లలోనే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క కుటుంబంలోనే దాదాపు 17 మందికి ఈ వ్యాధి సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ సోకినా, ఆ లక్షణాలు కన్పించినా చెప్పేందుకు ఇంకా కొందరు ముందుకు రావడం లేదని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండటంతో పెద్ద యెత్తున డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

Tags:    

Similar News