భారత్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ బారత్ లో పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది మరణాలు సంభవించినట్లు కేంద్ర [more]

Update: 2020-03-24 03:49 GMT

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ బారత్ లో పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. రాష్ట్రాల సరిహద్దులను మూసివేశాయి. నేటి నుంచి దేశీయ విమానాలు కూడా రద్దవుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది. రైళ్లు కూడా ఈ నెల 31వ తేదీ వరకూ నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. తెలంగాణలో 33, ఆంధ్రప్రదేశ్ లో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News