వారితోనే అంతా…. ఏపీలో 44కు చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాత్రి నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంల జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా ఢిల్లీలోని [more]

Update: 2020-04-01 01:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న రాత్రి నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంల జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. నిన్న రాత్రి మొత్తం 256 కేసులు పరీక్షలుచేయగా అందులో 235 నెగిటివ్ గా నిర్థారణ అయింది. 21 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపురంలో రెండు, చిత్తూరులో ఒకటి, తూర్పుగోదావరిలో నాలుగు, గుంటూరు జిల్లా 9, కృష్ణా జిల్లాలో నాలుగు, కర్నూలు, నెల్లూరు ఒకటి చొప్పున, ప్రకాశం జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News