తెలంగాణలో మళ్లీ పెరుగుతున్నాయ్… అక్కడి నుంచి వచ్చిన వారే?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు 38 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 1699కు [more]

Update: 2020-05-22 02:36 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు 38 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 1699కు చేరుకుంది. ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం 45 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఎక్కువ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ వలస జీవుల్లో 99 మంది వరకూ ఈ వ్యాధి సోకింది. నిన్న నమోదయిన 38 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివి 26 ఉండటం గమనార్హం. రెండు రంగారెడ్డి జిల్లాల్లో నమోదయ్యాయి. మరో పదిమంది వలసకార్మికులవే. వలస కార్మికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Tags:    

Similar News