కేసులు భారీగా పెరుగుతున్నాయి.. లాక్ డౌన్ మాత్రం?

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-07-05 02:17 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,312 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కారణంగా 288 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన 1,850 కేసుల్లో 1,572 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం లాక్ డౌన్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తే చిరువ్యాపారులతో సహా అందరూ ఇబ్బందులు పడతారని భావించిన ప్రభుత్వం హైదరాబాద్ లో లాక్ డౌన్ నిర్ణయంపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని ప్రభుత్వం కోరటం మినహా మరే చర్యలు ఉండబోవు. కరోనా టెస్ట్ ల సంఖ్య మరింతగా పెంచాలని మాత్రం ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News