స్లో అయింది కాని… మరణాలు మాత్రం పెరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గు ముఖం పట్టింది. నిన్న రాత్రికి కేవలం పదిహేను కరోనా పాజిటవ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ [more]

Update: 2020-04-10 01:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గు ముఖం పట్టింది. నిన్న రాత్రికి కేవలం పదిహేను కరోనా పాజిటవ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 363కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో రెండు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకూ పది మంది కరోనా చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. దీంతో పాటు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య పదికి చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News