అచ్చెన్నకు కరోనా… కుటుంబీకుల్లో ఆందోళన

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు రమేష్ ఆసుపత్రిలో [more]

Update: 2020-08-13 13:59 GMT

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే కరోనా సోకడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని అచ్చెన్నాయుడు కక్ష పూరితంగా అరెస్ట్ చేయడంతోనే ఆయనకు కరోనా సోకిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడికి కరోనా చికిత్సను ఆసుపత్రి వైద్యులు అందిస్తున్నారు.

Tags:    

Similar News