హైదరాబాద్ కు మళ్లీ అంటుకుందే? వారివల్లనేనా?

గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే గురువారం ఒక్కరోజే 22కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందారు. 22 కేసులు కూడా హైదరాబాద్ [more]

Update: 2020-05-01 02:14 GMT

గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే గురువారం ఒక్కరోజే 22కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందారు. 22 కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1038కి చేరుకుంది. మృతుల సంఖ్య 28 అయింది. హైదరాబాద్ లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. మలక్ పేట్ గంజ్ లో ఈ వైరస్ సోకినట్లు తెలియడంతో దానిని కంటోన్మెంట్ జోన్ లుగా ప్రకటించారు. పహాడీ షరీఫ్, జల్బల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు కొనుగొన్నారు. కొత్తగా మృతి చెందిన ముగ్గురూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News