బ్రేకింగ్ : తబ్లీగ్ ఘటన తర్వాతే 4.1 రోజుల్లో రెట్టింపు

కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 3,374 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లోనే [more]

Update: 2020-04-05 13:25 GMT

కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 3,374 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లోనే 472 కేసులు నమోదయ్యాయి. తబ్లీగ్ ఘటన తర్వాతనే 4.1 రోజులోనే కేసులు రెట్టింపయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అంతకు ముందు కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, తబ్లీగ్ ఘటన తర్వాతనే కేసుుల పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా 79 మంది మృతి చెందారు. తబ్లీగ్ ఘటనకు ముందు కేసులు రెట్టింపు కావడానికి 7.4 రోజుల సమయం పట్టిందని, తబ్లీగ్ ఘటన తర్వాత 4.1 రోజుల్లోనే రెట్టింపయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో లాక్ డౌన్ సంతృప్తికరంగా జరుగుతుందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News