తిరుమలపై కరోనా ఎఫెక్ట్… ఇక దర్శనాలను?

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరుగుతున్నాయి. దీని ప్రభావం తిరుమల పైన కూడా పడింది. దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. మే 1వ తేదీ [more]

Update: 2021-04-19 00:45 GMT

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరుగుతున్నాయి. దీని ప్రభావం తిరుమల పైన కూడా పడింది. దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి 300 దర్శన టిక్కెట్లపై కేవలం పదిహేను వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించిది. ఇప్పటికే సర్వదర్శనం టిక్కెట్లను నిలిపివేసింది. ఇప్పటికే టీటీడీలోనూ పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకూ తిరుమలలో భక్తుల సంఖ్యను నియంత్రించాలని టీటీడీ భావిస్తుంది. భవష్యత్ లో మరిన్ని నిర్ణయాలు టీడీపీ ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News