స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై కమిటీ నివేదిక సిద్ధం

స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటీ నేడు నివేదిక అందివ్వనుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వర్ణప్యాలెస్ లో [more]

Update: 2020-08-13 07:21 GMT

స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటీ నేడు నివేదిక అందివ్వనుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వర్ణప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహించుకునేందుకు ఈ ఏడాది మే 18 న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం అనుమతి కోరింది. అయితే మే 15వ తేదీ నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను నడుపుతున్నట్లు కమిటీ గుర్తించింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే స్వర్ణా ప్యాలెస్ లో ప్రమాదం జరిగిందని నిపుణుల కమిటీ తేల్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రమేష్ ఆసుపత్రి యజమాని పరారీలో ఉన్నారు.

Tags:    

Similar News