జమిలి ఎన్నికలని ఎవరు చెప్పారు?

జమిలి ఎన్నికలు జరుగుతాయని ఎవరు చెప్పారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు. జమిలి [more]

Update: 2020-09-07 08:59 GMT

జమిలి ఎన్నికలు జరుగుతాయని ఎవరు చెప్పారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని తెలిపారు. తమ వద్ద అయితే జమిలి ఎన్నికల గురించి ఎటువంటి సమాచారం లేదని తిరుపతిలో ఆయన మీడియాతో తెలిపారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందే ఏ పథకానికైనా రా‌ష్ట్రంలో మోదీ ఫొటోను పెట్టాలని సీఎం రమేష్ కోరారు. రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బీజేపీ సహకరిస్తుందని సీఎం రమేష్ చెప్పారు.

Tags:    

Similar News