ఓడిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

ఇటీవలి శానససభ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జడ్పీ ఛైర్ పర్సన్ పదవుల ఆఫర్ ఇచ్చారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్ లో [more]

Update: 2019-04-15 12:56 GMT

ఇటీవలి శానససభ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జడ్పీ ఛైర్ పర్సన్ పదవుల ఆఫర్ ఇచ్చారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 32 జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ దక్కించుకునేలా పనిచేయాలని సూచించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇందుకుగానూ అసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పేరును ఆయన ప్రకటించారు. ఇక, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ గా ఇటీవల మంథని నుంచి ఓడిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరును ఖరారు చేశారు. ఓడిన వారికి ఇతర పదవులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News