ఆర్మీని రంగంలోకి దించాల్సిందే

ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన చెందారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారని చెప్పారు. ఆర్మీని రంగంలోకి దించాలని కేజ్రీవాల్ కేంద్ర [more]

Update: 2020-02-26 05:45 GMT

ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన చెందారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారని చెప్పారు. ఆర్మీని రంగంలోకి దించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పోలీసులు ఒక్కరే ఈ పరిస్థితిని అదుపు చేయలేరని కేజ్రీవాల్ అన్నారు. గత మూడు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ చట్ట సవరణకు అనుకూల, వ్యతిరేక ర్యాలీలు చేపట్టడంతోనే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీని రంగంలోకి దించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా పోలీసుల పై సీరియస్ అయింది.

Tags:    

Similar News