అంబలితోనే చిదంబరం

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తొలి రోజు జైలు జీవితం కష్టంగానే గడిచింది. ఆయన రాత్రంతా నిద్రపోకుండా గడిపినట్లు తెలుస్తోంది. చిదంబారనికి సీబీఐ కోర్టు ఈనెల 19వ [more]

Update: 2019-09-06 09:46 GMT

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తొలి రోజు జైలు జీవితం కష్టంగానే గడిచింది. ఆయన రాత్రంతా నిద్రపోకుండా గడిపినట్లు తెలుస్తోంది. చిదంబారనికి సీబీఐ కోర్టు ఈనెల 19వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రాత్రి నిద్రపోకుండా గడిపిన చిదంబరానికి ఉదయాన్నే అల్పాహారం కింద అంబటి ఇచ్చారు. ఆయన అంబలితో సరిపుచ్చుకున్నారు. జైలు గది బయట వాకింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. చిదంబరానికి తీహార్ జైలులో ప్రత్యేక గది కేటాయించారు. గతంలో ఆయన కుమారుడుకార్తి చిదంబరం ఉన్న గదిలోనే తండ్రి కూడా ఉండటం విశేషం. ఉదయం చిదంబరం దినపత్రికలు చదివారు.

Tags:    

Similar News