మూడు గిఫ్ట్ లు ఇస్తాం… కేసీఆర్ కి బాబు హెచ్చరిక

తామేమీ చేతగానివాళ్లం కాదని, కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే తాము మూడు గిఫ్ట్ లు ఇస్తామని, వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. [more]

Update: 2019-01-18 08:50 GMT

తామేమీ చేతగానివాళ్లం కాదని, కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే తాము మూడు గిఫ్ట్ లు ఇస్తామని, వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఆయన సత్తెనపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ… తనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే కేసీఆర్.. జగన్ ని ఎంచుకున్నాడని, వీరిద్దరు ఏకమైనా రాష్ట్రాన్ని, తనను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

మోదీతో విభేదించాననే….

రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని చెబితే కేసీఆర్ వీలు కాదని చెప్పారని పేర్కొన్నారు. తాము మోదీతో బాగా ఉన్నన్ని రోజులు కేసీఆర్ కూడా తమతో బాగా ఉన్నారని, ఇప్పుడు మోదీని విభేదించినందుకు కేసీఆర్ తనను విభేదిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో పోటీ పడకుండా ఏపీలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా ప్రజలపైన, నాయకులపైన కేసీఆర్ ఇష్టానుసారం నోరు పారేసుకున్నారని గుర్తు చేశారు.

Tags:    

Similar News