కన్నీరు పెట్టిన చంద్రబాబు

మానసిక క్షోభ, శారీరక బాధ, వైసీపీ ప్రభుత్వం వేధింపులు చూసిన తర్వాత మానసిక ఆందోళనకు గురయ్యే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు [more]

Update: 2019-09-16 11:56 GMT

మానసిక క్షోభ, శారీరక బాధ, వైసీపీ ప్రభుత్వం వేధింపులు చూసిన తర్వాత మానసిక ఆందోళనకు గురయ్యే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో కోడెల చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు చంద్రబాబు. ఫైర్ బ్రాండ్ గా సేవా భావంతో ఎన్టీఆర్ పిలిస్తే సమాజసేవకు అంకితమైన నాయకుడు కోడెల శివప్రసాద్ అని చంద్రబాబు కొనియాడారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి ఎన్నో మంత్రిపదవులు చేపట్టారని, చివరికి నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి శాసనసభాపతిగా పనిచేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కోడెలను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

 

Tags:    

Similar News