ఎవరో నాకు తెలియాల్సిందే

తన ఇంటిపై డ్రోన్ కెమెరాలను వినియోగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన డీజీపీ, జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, [more]

Update: 2019-08-16 06:36 GMT

తన ఇంటిపై డ్రోన్ కెమెరాలను వినియోగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన డీజీపీ, జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ అనుమతి లేకుండా మాజీ సీఎం ఇంటిపై డ్రోన్ కెమెరాను ఎలా ఉపయోగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. చివరకు తన భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? అని నిలదీశారు. డ్రోన్లు ఉపయోగించింది ఎవరు? దానికి అనుమతులు ఇచ్చింది ఎవరో తనకు తెలియాలని చంద్రబాబు కోరారు. మాజీ ముఖ్యమంత్రికే ఏపీలో రక్షణ కరువయిందన్నారు.

Tags:    

Similar News