కేంద్రం, తెలంగాణ సర్కార్ ఉగ్రవాదుల్లా పనిచేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ ఉగ్రవాదుల్లో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ [more]

Update: 2019-03-07 08:51 GMT

ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ ఉగ్రవాదుల్లో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం తమ సమాచారాన్ని దొంగలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు. మా సమాచార్ని తొలగించి మాపైనే కేసు పెడుతున్నారని వాపోయారు. కేంద్రాన్ని నిలదీస్తే నిలదీస్తే కేంద్రం ఐటీ, ఈడీ దాడుల పేరుతో బెదిరిస్తుందన్నారు. టీడీపీకి సేవలు అందిస్తున్న ప్రైవేటు కంపెనీపై ఎలా దాడులు చేసి సమాచారాన్ని దొంగలిస్తారని ప్రశ్నించారు. దాడులు, కేసులతో ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారని, నాయకత్వాన్ని చంపేస్తారా అని వాపోయారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే జగన్ ఇంతలా అక్రమాలు చేస్తే అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఏం చేస్తారని ప్రశ్నించారు.

కేసీఆర్ కు ఏం అవసరం…?

మా ప్రభుత్వ సమాచారం పోలేదని మేమే చెబుతున్నాక విచారణ చేయడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా..? తన ప్రాణం ఉన్నంతవరకు ఇది జరగనివ్వనని స్పష్టం చేశారు. ఏపీలో సామంతరాజ్యం కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని, అందుకే జగన్ గెలవాలనుకుంటున్నారని అన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. 2004 ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా ఓట్లు తొలగించారిన సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీకి మౌత్ పీస్ గా ఉన్న సాక్షికి జవాబు ఇవ్వనని పేర్కొన్నారు. సాక్షికి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో జరిగిన దాని గురించి మాట్లాడవద్దని ఇప్పటి విషయం మాత్రమే తాను మాట్లాడతానని అన్నారు.

Tags:    

Similar News