చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే కాకినాడలో ఎమ్మెల్యే దూషించినా [more]

Update: 2020-01-13 12:37 GMT

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే కాకినాడలో ఎమ్మెల్యే దూషించినా కేసు నమోదు చేయలేదన్నారు. తనను నేరుగా అడ్డుకునే ధైర్యం లేక పోలీసులతో అడ్డుకుంటున్నారని చంద్రబాబు అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తాను గెలవకుంటే రాజకీయంగా తప్పుకుంటానని అన్నారు.

Tags:    

Similar News