బాబుకు పోటీగా రాజధాని రైతులు

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా రాజధానిలో రైతులు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతిపై తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ [more]

Update: 2019-12-05 04:05 GMT

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా రాజధానిలో రైతులు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతిపై తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలనూ ఆహ్వానించారు. సీపీఐ, జనసేన పార్టీలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా రాజధానిలో ఒకవర్గానికి చెందిన రైతులు మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు హాజరయ్యే అవకాశముంది. రాజధాని అంశంలో జగన్ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో టీడీపీ మేధావులు, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News