‘థాంక్యూ సీఎం సార్’ అని బోర్డు పెట్టండి

పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూడటమే తన ఏకైక కోరిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆటోలపై ట్యాక్సులు రద్దు చేసిన నేపథ్యంలో పలువురు ఆటో డ్రైవర్లు [more]

Update: 2019-02-02 07:21 GMT

పేదవాళ్ల కళ్లల్లో ఆనందం చూడటమే తన ఏకైక కోరిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆటోలపై ట్యాక్సులు రద్దు చేసిన నేపథ్యంలో పలువురు ఆటో డ్రైవర్లు ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో 3 లక్షల 70 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, మీరంతా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని తిరిగి ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది తన కోసం కాదని, రాష్ట్రం కోసమని అన్నారు. ఆటోడ్రైవర్లకు ట్యాక్సులు రద్దు కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్ మరిన్ని చేస్తామన్నారు. రానున్న రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయన్నారు. ఇవన్నీ జరగాలంటే రేపటి నుంచి ప్రతీ ఆటోకు తెలుగుదేశం జెండా పెట్టుకొవాలని, ఆటో వెనకాల ‘థాంక్యూ సీఎం సార్’ అని బోర్డు పెట్టాలని అన్నారు. 75 రోజులు తనకోసం పనిచేయాలన్నారు. ఆలోడ్రైవర్లందరికీ పెద్దన్నగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ఖాకీ చొక్కా ధరించడం గమనార్హం.

Tags:    

Similar News