రాష్ట్రంలో రౌడీయిజం పెరిగింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. తిరుపతిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో [more]

Update: 2021-04-13 01:50 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. తిరుపతిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో తిరుపతిని ఏడు కొండల నుంచి ఐదు కొండలను చేస్తానని వైఎస్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పింక్ డైమండ్ తన ఇంట్లోనే ఉందని ఆరోపణలు చేసి తర్వాత వెనక్కు తగ్గారన్నారు. రాముడి తలతీసిన వాళ్లను పట్టుకోకుండా నిలదీసిన తమపై కేసులు పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పోలీసులను ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు కోరారు. తిరుపతి సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాయి విసరడంతో కార్యకర్తకు గాయమైంది. దీంతో చంద్రబాబు ధర్నాకు దిగార.

Tags:    

Similar News