జగన్ ను విడిచిపెట్టొద్దు… చంద్రబాబు పిలుపు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విడిచిపెట్టవద్దని, ఎక్కడ కనపడినా నిలదీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన విశాఖలో పర్యటించారు. అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి [more]

Update: 2021-03-07 01:41 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విడిచిపెట్టవద్దని, ఎక్కడ కనపడినా నిలదీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన విశాఖలో పర్యటించారు. అబద్ధాలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. రెండేళ్లలోనే వీరి బండారం బయటపడిందని చంద్రబాబు తెలిపారు. భూ కబ్జాలు చేయడంలో ఆరితేరిన వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలుకు ఇప్పడిప్పుడే అర్థమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బొబ్బిలి పులిలా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని విశాఖ నుంచి రక్షించుకోవాలని కోరారు.

Tags:    

Similar News