దాడులకు దిగితే సమాచారం ఇవ్వండి

వైసీపీ దాడులను, దౌర్జన్యాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో సమర్థులైన వారినే ఎన్నుకోవాలని ఆయన సూచించారు. సర్పంచ్ గట్టి వాడైతేనే గ్రామం [more]

Update: 2021-01-30 01:31 GMT

వైసీపీ దాడులను, దౌర్జన్యాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో సమర్థులైన వారినే ఎన్నుకోవాలని ఆయన సూచించారు. సర్పంచ్ గట్టి వాడైతేనే గ్రామం బాగుపడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు దిగితే వెంటనే కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాలని చంద్రబాబు నేతలకు చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జోన్ కమిటీలతో పాటు, పార్టీ కేంద్ర కార్యాయలంలో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News