ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు [more]

Update: 2021-01-26 01:12 GMT

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన జాతీయ పతాకాలను ఎగురవేయాలని చంద్రబాబు కోరారు. వైసీపీ రాజ్యాంగ విలువలను కాపాడటం లేదని, దీనిని నిరసించాలని ఆయన కోరారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News