దుర్మార్గంగా ఆమోదించుకున్నారు

మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని అన్నారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకుండానే [more]

Update: 2020-07-31 13:23 GMT

మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని అన్నారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకుండానే ముందుకు వెళ్లడం పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. కానీ రాజధానులను మార్చడం సరికాదని చెప్పారు. బిల్లులను ఆమోదించుకోవడం దుర్మార్గమని చెప్పారు. అమరావతి రైతులకు జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శాసనమండలి స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని అన్నారు. దానికి విలువ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా అమరావతి చచ్చి పోయిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజా పోరాటం చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల బిల్లులకు ఆమోదానికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలపాలని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News