జగన్ కంటే ట్రంప్ ఎన్నో రెట్లు నయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర [more]

Update: 2020-07-29 02:41 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర తర్వాత యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. అలాగే కరోనా కారణంగా మరణించే వారి సంఖ్యలో ఏపీ నాలుగో స్థానానికి చేరిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సయితం మాస్క్ ధరిస్తుంటే జగన్ మాత్రం కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News