వారినే టార్గెట్ చేశారు.. ఈ అక్రమ కేసులు ఎందుకు?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీికి లేఖ రాశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రధానంగా బలహీన వర్గాల వారినే టార్గెట్ [more]

Update: 2020-06-18 03:21 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీికి లేఖ రాశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రధానంగా బలహీన వర్గాల వారినే టార్గెట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని, అదే సమయంలో అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పోలీసులు పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News