బాబు కీలక ప్రకటన ఇదే

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎవరూ పార్టీ కార్యాలయాల్లో జరపవద్దని ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 1982 మార్చి 29వ తేదీన [more]

Update: 2020-03-29 02:40 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎవరూ పార్టీ కార్యాలయాల్లో జరపవద్దని ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 1982 మార్చి 29వ తేదీన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ కార్యాలయాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. కరోనా బారిన ఎవరూ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News