జగన్ కు చంద్రబాబు లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కోరారు. అలాగే లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు [more]

Update: 2020-03-23 12:59 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కోరారు. అలాగే లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు ఇబ్బంది పడకుండా వారికి రెండు నెలల రేషన్ ను ఉచితంగా ఇవ్వాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని తన లేఖలో చంద్రబాబు కోరారు. కరోనా కట్టడికి సమర్థవంతంగా చర్యలు తీసుకుంటూనే, పేదలు అవసరాలు తీర్చాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఉపాధి కోల్పోయే వారికి అండగా ప్రభుత్వం ఉండాలని కోరారు. అలాగే కూరగాయల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News