బ్రేకింగ్ : బాబు దిగ్భంధం…. రెండుగంటల నుంచి వాహనంలోనే

విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన సజావుగా సాగేట్లు కన్పించడం లేదు. దాదాపుగా రెండు గంటల నుంచి చంద్రబాబు ఎయిర్ పోర్టు వద్దనే వేచి చూస్తున్నారు. తొలుత పాదయాత్రగా వెళదామని [more]

Update: 2020-02-27 08:46 GMT

విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన సజావుగా సాగేట్లు కన్పించడం లేదు. దాదాపుగా రెండు గంటల నుంచి చంద్రబాబు ఎయిర్ పోర్టు వద్దనే వేచి చూస్తున్నారు. తొలుత పాదయాత్రగా వెళదామని చంద్రబాబు భావించినా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన వాహనంలోనే ఉండిపోయారు. వైసీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉండటం, కాన్వాయ్ కు అడ్డుగా పడుకోవడంతో పోలీసులు సయితం వారిని తొలగించలేక పోతున్నారు. గత రెండు గంటలుగా చంద్రబాబు కాన్వాయ్ విశాఖ ఎయిర్ పోర్టు వద్దనే ఉంది. ఉత్తరాంధ్ర జేఏసీ నేత ఒకరు చంద్రబాబు కాన్వాయ్ వద్ద పెట్రోలు పోసుకుని ఆత్మహత్య కు పాల్పడటంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్ ఎప్పుడు ముందుకు వెళుతుందో పోలీసులు కూడా చెప్పలేక పోతున్నారు.

Tags:    

Similar News