ఎవరినీ వదిలిపెట్టను… వడ్డీతో సహా ఇస్తా

ఎవరినీ వదలిపెట్టనని, వడ్డీతో సహా చెల్లిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై తాను అధికారంలో ఉండగా ఇలాగే చేసి ఉంటే పార్టీ [more]

Update: 2020-02-25 11:44 GMT

ఎవరినీ వదలిపెట్టనని, వడ్డీతో సహా చెల్లిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై తాను అధికారంలో ఉండగా ఇలాగే చేసి ఉంటే పార్టీ ఉండేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుడం అమానుషమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను కూడా ప్రలోభపర్చిందని, అయితే ఎవరూ లొంగలేదని, అందుకే మండలిని రద్దు చేస్తున్నట్లు శాసనసభలో తీర్మానం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దన్నారు. అభివృద్ధి జరగాలంటే టీడీపీకే ఓటు వేయాలన్నారు. జగన్ ను చూసి పెట్టుబడుదారులు కూడా వెనక్కు పోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి ఒక్క టీడీపీతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించి వైసీపీికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News