బ్రేకింగ్ : ఎన్నికల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రూ. 1 [more]

Update: 2019-01-11 11:40 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రూ. 1 వెయ్యి ఉన్న వృద్ధాప్య పింఛన్ ను రూ. 2 వేలకు, రూ.2 వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్ ను రూ.3 వేలకు పెంచారు. నెల్లూరు జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం 51 లక్షల పింఛన్ దారులు ఉండగా మరో నాలుగు లక్షల మందికి కూడా పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచిస్తోంది. పెంచిన పింఛన్లను ఈ నెల నుంచే అందివ్వనున్నారు.

Tags:    

Similar News