Chandrababu : ఢిల్లీకి చంద్రబాబు… అమిత్ షాతో….?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న [more]

Update: 2021-10-20 08:42 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న విషయాలను వివరించనున్నారు. ఈ మేరకు అమిత్ షా కార్యాలయాన్ని చంద్రబాబు సంప్రదించినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. 2019 ఎన్నిలకు ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి ఎన్నికల కమిషన్ ను కలిశారు. ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లలేదు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు తిరిగి ఢిల్లీ వెళుతున్నారు. ఇక్కడ నిరసనదీక్ష ముగిసిన తర్వాత శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు.

Tags:    

Similar News