Chandrababu : నేరగాళ్లకు తిరుమల బోర్డులో అవకాశమిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీటీడీ బోర్డు ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. [more]

Update: 2021-09-17 04:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీటీడీ బోర్డు ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. 81 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేయడం పవిత్రతను దెబ్బతీయడమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బోర్డులో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో తిరుమలతో అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, వెంటనే బోర్డును రద్దు చేయాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు.

Tags:    

Similar News