దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయాలి

విశాఖ లో వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో భూమలను వైసీపీ నేతలు [more]

Update: 2020-09-19 03:14 GMT

విశాఖ లో వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో భూమలను వైసీపీ నేతలు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునే వారే లేరన్నారు. అక్కడ వన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. విశాఖలో భూ కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ చేసే దమ్ముందా? అని చంద్రబాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు. వైసీపీ 16 నెలల పాలనలో అంతా అవినీతి మయమైందన్నారు. మద్యం బ్రాండ్ల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇళ్ల స్థలాల పేరిట పెద్దయెత్తున అవినీతికి తెరలేపారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    

Similar News