వైసీపీ పిచ్చి మామూలుగా లేదు

తాను అన్ని విధాలుగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే, ఇటీవల వచ్చిన జగన్ ప్రభుత్వం దానిని పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దీంతో [more]

Update: 2019-11-06 11:24 GMT

తాను అన్ని విధాలుగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే, ఇటీవల వచ్చిన జగన్ ప్రభుత్వం దానిని పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దీంతో అనేక కంపెనీలు వెనక్కు వెళ్లిపోతున్నాయన్నారు. తాను దూరదృష్టితో రాజధాని అమరావతిని బంగారు బాతుగా మారుద్దామనుకుంటే దానని జగన్ చంపేస్తున్నారన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లే వాళ్లా? నన్ను విమర్శించేది అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పాలనలో అన్నీ రివర్స్ లోనే నడుస్తున్నాయన్నారు. చివరకు తాను నిర్మించిన ప్రజావేదికను కూడా కూల్చివేశారన్నారు. మూడురోజుల పాటు చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించననున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు. పంచాయతీ ఆఫీసులకు పార్టీ రంగులు వేశారని, ఇక పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వేస్తారేమోనని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

Tags:    

Similar News