బ్రేకింగ్ : సంక్రాతి తర్వాత టీడీపీ తొలి అభ్యర్థి ఖరారు…!!

విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఈసారి ఈ సీటు నుంచి తన కూతురు షబానా ఖాతూర్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు [more]

Update: 2019-01-22 08:34 GMT

విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఈసారి ఈ సీటు నుంచి తన కూతురు షబానా ఖాతూర్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారని ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ఆయన కూతురితో కలిసి చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. తన కూతురికి విజయవాడ పశ్చిమ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జలీల్ ఖాన్… తన కూతురికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్డ్ కావడం లేదని, పార్టీకి తన సేవలు అందిస్తానని పేర్కొన్నారు. అవసరమైతే గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తానని ప్రకటించారు.

Tags:    

Similar News