తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, గతంలో రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టేందుకు అవకాశం వచ్చినా తాను రాష్ట్రం కోసం వదిలేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ... సీబీఐ, ఈడీ, ఐటీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. బీజేపీ అవినీతి పార్టీతో కలిసిపోయిందని ఆరోపించారు.